అల్వాల్, వెలుగు: అక్రమంగా విక్రయిస్తున్న డిఫెన్స్ లిక్కర్ను పోలీసులు పట్టుకున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కౌకూర్ లోని శ్యామల కన్వెన్షన్ వెంకటేశ్వర నగర్ సమీపంలో అమరేందర్ రెడ్డి అనే వ్యక్తి గురువారం డిఫెన్స్ బాటిల్స్ అమ్ముతున్నాడు. సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ ‘డి’ టీం సీఐ నాగరాజు, ఎస్సై జ్యోతి తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. 20 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడినిఅల్వాల్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు.

