దేశ రాజధాని నుంచి దుబాయ్కి వెళ్తున్న వ్యక్తిని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (ఐజీఐ) విమానాశ్రయంలో ఢిల్లీ పోలీసులు పట్టుకోగా.. అతని వద్ద ఆరు బుల్లెట్లు లభించాయని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 27న ఎమిరేట్స్ విమానంలో దుబాయ్కి వెళ్తున్న ప్రయాణికుడిని అమ్రిష్ బిష్ణోయ్గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
నిందితులు లైవ్ మందుగుండు సామగ్రిని తీసుకెళ్లడానికి సరైన పత్రాలను కలిగి లేరని పోలీసులు తెలిపారు. అతనిపై ఐజీఐ విమానాశ్రయ పోలీస్ స్టేషన్లో ఆయుధ చట్టంలోని సెక్షన్ 25 కింద కేసు నమోదైనట్టు వెల్లడించారు.
"ఢిల్లీ నుంచి దుబాయ్కి ఎమిరేట్స్ విమానంలో ప్రయాణిస్తున్న అమ్రిష్ బిష్ణోయ్ అనే ప్రయాణికుడిని జూన్ 27న ఢిల్లీ ఐజీఐ ఎయిర్పోర్ట్లో 6 లైవ్ కాట్రిడ్జ్లతో అదుపులోకి తీసుకున్నాం. మందుగుండు సామగ్రిని తీసుకువెళ్లడానికి అతని వద్ద సరైన పత్రాలు లేవు. ఈ క్రమంలో ఎయిర్పోర్ట్ పీఎస్లో ఆయుధ చట్టంలోని సెక్షన్ 25 కింద కేసు నమోదు చేశాం. ప్రస్తుతం విచారణ జరుగుతోంది" అని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.