భార్యతో గొడవ.. రెండేళ్ల కుమారుడ్ని బాల్కనిలోంచి తోసేసిన భర్త

భార్యతో గొడవ.. రెండేళ్ల కుమారుడ్ని బాల్కనిలోంచి తోసేసిన భర్త

భార్యతో గొడవ పడిన భర్త క్షణికావేశంలో దారుణానికి పాల్పడ్డాడు. తన రెండేళ్ల కుమారుడిని మూడంతస్తుల భవనంపై నుంచి కిందకు విసిరేశాడు. తర్వాత తాను కూడా కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఢిల్లీలోని కల్కాజీ మురికివాడలో చోటుచేసుకుంది. 

మాన్ సింగ్ అతని భార్య పూజ విభేదాల కారణంగా కొద్ది నెలలుగా విడివిడిగా నివసిస్తున్నారు. పూజ ప్రస్తుతం కల్కాజీలోని తన పుట్టింట్లో ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది. నిన్న సాయంత్రం మాన్ సింగ్ పూజను కలిసేందుకు అక్కడికి వెళ్లాడు.  ఆ సమయంలో ఇద్దరి మధ్య మళ్లీ గొడవ మొదలైంది. ఇద్దరి మధ్య మాటమాట పెరిగడంతో మాన్ సింగ్ ఆగ్రహానికి గురయ్యాడు. అక్కడే ఉన్న తన రెండేళ్ల కుమారుడిని బాల్కనిలోంచి కిందికి విసిరేశాడు. అనంతరం తాను కిందకు దూకేశాడు. ఈ ఘటనలో బాలుడు, మాన్‌సింగ్‌ తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు మాన్‌ సింగ్‌పై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.