న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆర్కేపురంలో గల ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు బాంబు బెదిరింపులు వచ్చాయి. శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని దుండగులు స్కూల్లో రెండు బాంబులు పెట్టినట్టు పాఠశాలకు ఈ మెయిల్ చేశారు. దీంతో స్కూల్ మేనేజ్మెంట్వెంటనే విషయాన్ని పోలీసులకు తెలియజేసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్కూల్కు చేరుకొని స్టూడెంట్లను ఖాళీ చేయించారు. అనంతరం బాంబు డిటెక్షన్ టీం, డాగ్ స్క్వాడ్ ను పిలిపించి స్కూల్తో పాటు హాస్టల్ను క్షుణ్ణంగా పరిశీలించారు.
అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు గానీ, అనుమానాస్పద వస్తువులు గానీ కనిపించలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. ఈ మెయిల్ ఐపీ అడ్రస్ను ట్రాక్ చేస్తున్నామని చెప్పారు. గతేడాది సెప్టెంబర్లో కూడా ఆర్కే పురంలోని లాల్ బహదూర్ శాస్త్రి స్కూల్ ఆవరణలో బాంబు ఉందంటూ ఒక ఇమెయిల్ వచ్చింది. ఆ తర్వాత అది ఫేక్అని తేలింది. మేలో మధుర రోడ్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు ఇలాంటి నకిలీ ఈ మెయిల్ వచ్చింది. అలాగే, సాదిక్ నగర్లోని ఇండియన్ స్కూల్కు సైతం రెండు సార్లు బాంబు బెదిరింపులు వచ్చాయి.