దేశ రాజధానిలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. రాజ్ పథ్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. రిపబ్లిక్ డే పరేడ్లో 155 హెలికాప్టర్ యూనిట్కు చెందిన నాలుగు Mi-17V5 హెలికాప్టర్లు వైన్ గ్లాస్ ఫార్మాట్ లో ఎగురుతూ కనిపించాయి. రాష్ట్రపతికి 871 ఫీల్డ్ రెజిమెంట్ సెరిమోనియల్ బ్యాటరీ ద్వారా 21-గన్ సెల్యూట్ సమర్పించారు. రాజ్ పథ్ కు సమీపంలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమర జవాన్లకు ప్రధాని మోదీ నివాళులు అర్పించడంతో గణతంత్ర వేడుకలు మొదలయ్యాయి. కోవిడ్ కారణంగా ఈ ఏడాది గణతంత్ర వేడుకలు ఆలస్యంగా మొదలవుతున్న విషయం తెలిసిందే.
Detachments of Centurion Tank, PT-76, MBT Arjun MK-I, and APC Topaz participate in the #RepublicDay parade at the Rajpath in Delhi. pic.twitter.com/dKUJTS0QFT
— ANI (@ANI) January 26, 2022
ఇవి కూడా చదవండి:
గణతంత్ర స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ఢిల్లీలో జాతీయ జెండాను ఆవిష్కరించిన నడ్డా