దేశ రాజధానిలో ఘనంగా రిపబ్లిక్ డే

దేశ రాజధానిలో ఘనంగా రిపబ్లిక్ డే

దేశ రాజధానిలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. రాజ్ పథ్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. రిపబ్లిక్ డే పరేడ్‌లో 155 హెలికాప్టర్ యూనిట్‌కు చెందిన నాలుగు Mi-17V5 హెలికాప్టర్లు వైన్ గ్లాస్ ఫార్మాట్ లో ఎగురుతూ కనిపించాయి. రాష్ట్రపతికి 871 ఫీల్డ్ రెజిమెంట్  సెరిమోనియల్ బ్యాటరీ ద్వారా 21-గన్ సెల్యూట్ సమర్పించారు.  రాజ్ పథ్ కు సమీపంలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమర జవాన్లకు ప్రధాని మోదీ నివాళులు అర్పించడంతో గణతంత్ర వేడుకలు మొదలయ్యాయి. కోవిడ్ కారణంగా ఈ ఏడాది గణతంత్ర వేడుకలు ఆలస్యంగా మొదలవుతున్న విషయం తెలిసిందే. 
 

ఇవి కూడా చదవండి: 

గణతంత్ర స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ఢిల్లీలో జాతీయ జెండాను ఆవిష్కరించిన నడ్డా