డెల్ మూడు కొత్తగా- ఎక్స్పీఎస్ 13 ప్లస్, ఎక్స్పీఎస్ 15, ఎక్స్పీఎస్ 17 అనే మూడు ల్యాప్టాప్లను ఇండియా మార్కెట్లో లాంచ్ చేసింది. మూడు నోట్బుక్లు సరికొత్త 13వ జెన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్తో పనిచేస్తాయి. సొగసైన డిజైన్, ప్రీమియం నిర్మాణ నాణ్యత వల్ల చూడటానికి అందంగా ఉంటాయని డెల్ తెలిపింది.
క్వాడ్-స్పీకర్ సెటప్, 4-వైపుల ఇన్ఫినిటీఎడ్జ్ టచ్ డిస్ప్లే, మెటల్ బిల్డ్, డ్యూయల్ సెన్సార్ కెమెరాలు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6, విండోస్ హలో ఫేస్ రికగ్నిషన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. 32జీబీ వరకు ర్యామ్, 1 టీబీ వరకు స్టోరేజ్ ఉంటుంది. ధరలు రూ.రెండు లక్షల నుంచి రూ.మూడు లక్షల వరకు ఉంటాయి.