గుడ్ న్యూస్.. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ లో..23వేల మందికి డెల్శిక్షణ

 గుడ్ న్యూస్.. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ లో..23వేల మందికి డెల్శిక్షణ
  • 23 వేల మందికి డెల్​శిక్షణ..

ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ ఎలక్ట్రానిక్స్  లో శిక్షణ తీసుకోవాలనుకునేవారికి గుడ్ న్యూస్.. ప్రముఖ కంప్యూటర్ల  తయారీ సంస్థ  23 వేలమంది యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఉడాన్ పేరుతో  శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది. మన హైదరాబాద్ లోని ఐటీఐ సెంటర్లలో ఈ శిక్షణ కార్యక్రమాలు  నిర్వహించనున్నారు.  

డెల్ టెక్నాలజీస్ ఉడాన్ పేరుతో  శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఐఐటీ ఢిల్లీ , లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్, జనరేషన్ ఇండియా ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, ఎలక్ట్రానిక్స్​లో 23 వేల మంది యువతకు నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తారు. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణేలోని 100 ఐటీఐలు, 90 విద్యాసంస్థల్లో ఈ కార్యక్రమం అమలవుతుంది. పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా ప్రత్యేక సిలబస్ను తయారు చేస్తారు.