పోతిరెడ్డి పాడుపై కేసీఆర్ ఎందుకు మాట్లాడం లేదు

పోతిరెడ్డి పాడుపై కేసీఆర్ ఎందుకు మాట్లాడం లేదు

పోతిరెడ్డి పాడు 203 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. ఏపీ పోతిరెడ్డి పాడు నీళ్లను తరలిస్తే…దక్షిణ తెలంగాణ జిల్లాలైన నల్లగొండ,మహబూబ్ నగర్,రంగారెడ్డి,ఖమ్మం జిల్లాలు ఎడారులుగా మారుతాయన్నారు. తెలంగాణ నీళ్ల వాటాను అక్రమంగా ఆంధ్ర తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నా..సీఎం కేసీఆర్ మాట్లాడక పోవడం దారుణమన్నారు

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ నిధులు,నియమాల కోసమన్న కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి… ప్రస్తుతం నిధులు లేవు నియామకాలు లేవని ఆరోపించారు. కేసీఆర్ చేతకానితనంతో మళ్ళీ రెండు ప్రాంతాల్లో విద్వేషాలు, కొట్లాలు జరిగే ప్రమాదముందని స్పష్టం చేశారు. పోతిరెడ్డి పాడు నిర్మాణం జరిగితే చరిత్ర హీనుడుగా కేసీఆర్ మిగిలి పోతారన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు 90% పనులు పూర్తయినా… దానితోపాటు ప్రారంభమైన బ్రహ్మవెల్లంల,డిండి,పాలమూరు,SLBC ప్రాజెక్టుల 9% కూడా పూర్తి చేయకపోవడం కేసీఆర్ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.