మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ లో అక్రమ కట్టడాల కూల్చివేత ఉద్రిక్తకు దారి తీసింది. నియోజక వర్గంలోని దేవేందర్ నగర్,బాలయ్య బస్తీలో వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చి వేసేందుకు రెవెన్యూ,పోలీసు అధికారులు ప్రయత్నించారు. జేసీబీలతో ఇండ్లను కూల్చివేస్తుండగా స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు భారీగా మోహరించారు.
కిరోసిన్ పోసుకుని తగలపెట్టుకునేందుకు యత్నించిన కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కవర్ చేసేందుకు వచ్చిన మీడియాపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మీడియాపై బూతులు తిడుతూ ఫోన్లు లాక్కున్నారు. మీరేం చేసేది లేదంటూ వ్యాఖ్యానించారు.