గ్రీన్లాండ్ లో డెన్మార్క్ బలగాలు..ఆపరేషన్ ఎండ్యూరెన్స్ పేరిట మిలిటరీ ఎక్సర్ సైజ్

గ్రీన్లాండ్ లో డెన్మార్క్ బలగాలు..ఆపరేషన్ ఎండ్యూరెన్స్ పేరిట మిలిటరీ ఎక్సర్  సైజ్
  • కంగెర్లుసువాక్ లో దిగిన 58 మంది సైనికులు 
  • సాధారణ కార్యకలాపాల కోసమేనన్న నాటో దేశం   
  • వెనక్కి తగ్గని అమెరికా.. యుద్ధవిమానాన్ని పంపించేందుకు సిద్ధం 

వాషింగ్టన్: అమెరికా భద్రత కోసం గ్రీన్​లాండ్​ను స్వాధీనం చేసుకుంటామని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరిస్తుండటంతో డెన్మార్క్ కీలక చర్యలు చేపట్టింది. గ్రీన్​లాండ్​లో కొత్తగా సైనిక బలగాలను మోహరించింది. సోమవారం సాయంత్రం కంగెర్లుసువాక్ లో 58 మంది సైనికులను దించింది. రాయల్ డానిష్ ఆర్మీ చీఫ్ పీటర్ బాయ్సెన్  నేతృత్వంలో సైనికులు చార్టర్డ్ ప్లైట్​లో గ్రీన్​లాండ్​లో ల్యాండ్ అయ్యారు. 

అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. ఇప్పటికే డెన్మార్క్.. గ్రీన్​లాండ్​లో ‘ఆపరేషన్ ఎండ్యూరెన్స్’ పేరిట మల్టీ నేషనల్ మిలిటరీ ఎక్సర్ సైజ్​ నిర్వహిస్తున్నది. ఈ సైనిక విన్యాసాల్లో నాటో కూటమిలోని పలు దేశాలకు చెందిన 60 మంది సైనికులు  పాల్గొంటున్నారు. కొత్తగా వచ్చిన బలగాలు వీరితో చేరనున్నాయి. 

సైనికులను భారీగా దించడంపై డెన్మార్క్ స్పందించింది.  గ్రీన్​లాండ్​లో కేబుల్స్, రాడార్లు, రన్ వేలు ధ్వంసం కాకుండా చూడటం కోసమే ఈ దళాలను రంగంలోకి దింపామని తెలిపింది. 

గ్రీన్​లాండ్​పై అమెరికా దూకుడు 

గ్రీన్​లాండ్ విషయంలో అమెరికా కూడా వెనక్కి తగ్గడం లేదు. ఆ దేశంలో తమకు కీలక పోర్టు అయిన పిటుఫిక్ స్పేస్ బేస్ లో యుద్ధ విమానాన్ని మోహరించేందుకు సిద్ధమైనది. ఈ మేరకు నార్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమెరికా ఏరోస్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(నోరాడ్) సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది.  త్వరలోనే తమ సైనిక విమానం పిటుఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బేస్​కు చేరుకుంటుందని తెలిపింది. 

మిస్సైల్స్, శాటిలైట్స్​ను ట్రాక్ చేయడంలో భాగంగా ఈ మోహరింపును చేపట్టినట్టు పేర్కొంది. డెన్మార్క్ డిప్లోమాట్స్​కు కూడా దీని గురించి ముందుగానే సమాచారం అందించామని చెప్పింది.