ఢిల్లీలోని షాలిమార్ బాగ్ ప్రాంతంలో దారుణం జరిగింది. ఆర్థిక ఇబ్బందులతో నిరాశకు గురైన ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలను చంపి తాను రైలు కింద దూకి సూసైడ్ చేసుకున్నాడు. అసలేం జరిగిందంటే. 44 ఏళ్ల మధుర్ మలానీ అనే వ్యాపార వేత్తకు ఓ ఇటుక ఫ్యాక్టరీ ఉంది. నష్టాలతో ఫ్యాక్టీరీని మూసి వేసి ఆరు నెలలు అయ్యింది. తిరిగి ఆ ఫ్యాక్టరీని ఓపెన్ చేయడానికి చాలా కష్టపడ్డాడు. ఆ సమయంలో వారి తల్లిదండ్రులు కూడా అతనికి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా తాను వ్యాపారంలో క్లిక్ కాకపోవడం ఆర్థిక సమస్యలు వెంటాడంతో మధుర్ మలానీ నిరాశ నిస్పృహకు లోనయ్యాడు. ఆదివారం సాయంత్రం సమయంలో తన భార్య రూపాలీ కూరగాయల మార్కెట్ కు వెళ్లింది.
ఆ సమయంలో తన ఇద్దరు పిల్లలు సమీక్ష(14), శ్రేయాన్ (6) ఇద్దరిని ఇంట్లో గొంతు కోసి తాను పారిపోయాడు. ఇంటికి వచ్చిన అతని భార్య రూపాలీ తన పిల్లలు చనిపోయిన విషయాన్ని గుర్తించింది. తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫోన్ చేసింది. దీంతో పోలీసులు ఘటన స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా హైదర్పూర్ స్టేషన్ ఢిల్లీ మెట్రో ఎల్లో లైన్ వద్ద మదుర్ మలానీ మృతదేహాన్ని గుర్తించారు. పిల్లలను మధ్యాహ్నం చంపేసి తాను మరుసటి రోజు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే పిల్లలను ఎందుకు చంపాడనే విషయం ఇంకా తెలియలేదు. పోస్టుమార్టం రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మిగతా వివరాలు తెలియజేస్తామని డిప్యూటీ పోలీస్ కమిషనర్ (నార్త్వెస్ట్) విజయంత ఆర్య తెలిపారు.
see more news