గద్దర్​ కుటుంబానికి అండగా ఉంటం : భట్టి

గద్దర్​ కుటుంబానికి  అండగా ఉంటం : భట్టి

హైదరాబాద్, వెలుగు: ప్రజాగాయకుడు గద్దర్​ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సికింద్రాబాద్ వెంకటాపురంలోని మహాబోధి విద్యాలయం ఆవరణలో ఉన్న గద్దర్ సమాధి వద్దకు బుధవారం ఆయన వెళ్లి నివాళులర్పించారు. గద్దర్ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. డిప్యూటీ సీఎం వెంట ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఉన్నారు.