
- చిన్న బీరవల్లి, గార్లపాడు, బోనకల్ లో పర్యటన
- రూ.9 49కోట్ల బీటీ రోడ్డు, రిపేరు పనులకు శంకుస్థాపన
మధిర, వెలుగు: అభివృద్ధి పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటిస్తూ త్వరగా రోడ్డు నిర్మాణాలు పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. బోనకల్ మండలం కేంద్రంతోపాటు చిన్న బీరవల్లి, గార్లపాడు లో రూ.9.49 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణం, రిపేర్లకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. అందులో బోనకల్ మండలం గార్లపాడు నుంచి వయా రామపురం మీదుగా నాగులవంచ వరకు రూ.2.23కోట్లతో బీటీ రోడ్డు, చిన్న బీరవల్లి నుంచి నారాయణపురం వరకు రూ.4.50కోట్లతో బీటీ రోడ్డు రిపేరు పనులు చేపట్టనున్నారు.
బోనకల్ ఇందిరమ్మ డెయిరీ నుంచి రావినూతల వరకు రూ.2.76కోట్లతో కొత్తగా బీటీ రోడ్డు నిర్మించనున్నారు. కాగా, ఆయా గ్రామాల్లో డిప్యూటీ సీఎంకు మహిళలు ఘనస్వాగతం పలికారు. అనంతరం రోడ్డు నిర్మాణానికి సంబంధించిన అంశాలను డిప్యూటీ సీఎం అధికారులతో చర్చించి మ్యాప్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు, ఆత్మ కమిటీ చైర్మన్ కర్నాటి రామకోటేశ్వరరావు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.