- విద్యుత్ ఉద్యోగులకు డిప్యూటీ సీఎం ఆదేశం
హైదరాబాద్, వెలుగు : విద్యుత్ సంస్థల ఉద్యోగులు కష్టపడి పని చేసి రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటు అందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. విద్యుత్ అకౌంట్స్ అఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీని మంగళవారం ఆయన ఆవిస్కరించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. విద్యుత్ సమస్య తలెత్తకుండా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలన్నారు.
విద్యుత్పై విమర్శలు రాకుండా క్రమశిక్షణతో పని చేసి సంస్థకు గుర్తింపు తీసుకురావాలన్నారు. వీఏవోఏ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్, ప్రధానకార్యదర్శి పి.అంజయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు నాసర్ షరీఫ్, పరమేశ్ స్వామి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.