సికింద్రాబాద్ , వెలుగు : విద్యార్థుల్లోని నైపుణ్యాలను వెలికి తీసి, భవిష్యత్కు దోహదపడేలా తీర్చిదిద్దాలని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్పేర్కొన్నారు. టీచర్ నిత్య విద్యార్థిగా ఉంటూ తను నేర్చుకున్న విషయాలను, నైపుణ్యాలను విద్యార్థులకు బోధించాలని సూచించారు. హబ్సిగూడలో కొత్తగా నిర్మించిన కౌన్సిల్ఫర్ద ఇండియన్స్కూల్సర్టిఫికెట్ఎగ్జామినేషన్ బిల్డింగ్ ను సోమవారం డిప్యూటీ సీఎం శివకుమార్ ప్రారంభించారు.
అనంతరం విద్యార్థులకు ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించిన తర్వాత మాట్లాడారు. అంతకు ముందు ఉదయం సెంటర్లో వివిధ స్కూళ్ల టీచర్లు, కరస్పాండెంట్లకు ప్రత్యేక సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో పలు స్కూళ్లకు చెందిన విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సెయింట్ జోసెఫ్ స్కూల్ చైర్మన్ జె. ఇమ్మాన్యుయేల్ , ఉప్పల్ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, వివిధ స్కూళ్ల కరస్పాండెంట్లు పాల్గొన్నారు.