డ్రగ్స్ మహమ్మారిని అంతం చేద్దాం : వెంకదేశ్ బాబు

డ్రగ్స్ మహమ్మారిని అంతం చేద్దాం : వెంకదేశ్ బాబు
  • కేంద్ర కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ వెంకదేశ్ బాబు 

సిద్దిపేట రూరల్, వెలుగు: డ్రగ్స్ మహమ్మారిని అంతం చేద్దామని సీనియర్ ఐఆర్ఎస్ అధికారి, కేంద్ర కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ వెంకదేశ్ బాబు వైద్య యువతకు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సూచనల మేరకు సిద్దిపేట విపంచి ఆడిటోరియంలో డ్రగ్స్, ఎడిక్షన్ అంశంపై సిద్దిపేట మెడికల్, నర్సింగ్ కాలేజ్​ స్టూడెంట్స్​కు సెమినార్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత మేలుకొనే సమయం ఆసన్నమైందని, డ్రగ్స్​గురించి మాట్లాడడం నేరం కాదు డ్రగ్స్ తీసుకోవడం చట్టరీత్యా నేరమన్నారు. ఈ సెమినార్ లో మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.