ట్రీట్ మెంట్ ఫ్యాకేజీ ఇదీ..!

ట్రీట్ మెంట్ ఫ్యాకేజీ ఇదీ..!

హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు హాస్పిటళ్ల‌లో కరోనా ట్రీట్‌‌మెంట్‌‌కు ప్యాకేజీలను నిర్ణ‌యిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రొటీన్ వార్డు ఐసోలేషన్ కు రోజుకు రూ.4వేలు, ఐసీయూ వార్డు ఐసోలేషన్ ‌కు రూ.7,500, ఐసీయూలో వెంటిలేటర్ పెడితే రోజుకు రూ.9 వేలు చార్జ్‌‌ చేయాలని పేర్కొంది. ఈ ప్యాకేజీల్లో పేషెంట్లకు భోజనం, మందులు అందించాలనిఆదేశించింది.

ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలో కవర్‌‌‌‌ అయ్యేవి

మందులు, బెడ్ చార్జెస్‌ర్జె , డాక్టర్‌‌‌‌ కన్సల్టేషన్‌‌, భోజనం, పేషెంట్ మానిటరింగ్ (నర్సింగ్), సీబీసీ, యూరిన్‌‌ రొటీన్ , హెచ్‌ఐవీ స్పాట్‌, యాంటి హెచ్‌సీవీ, హెచ్‌బీఎస్‌ ఏజీ, సీరమ్ క్రియాటిన్‌‌, యూఎస్‌జీ, 2 డీఎకో, ఎక్స్‌‌–రే వంటి టెస్టులు. రైలిస్ ‌ట్యూబ్‌‌ ఇన్సెరన్ష్ , యూరినరీ ట్రాక్ట్ క్యాథటరైజేషన్ వంటివన్నీ ప్రభుత్వం నిర్ణ‌యించిన ప్యాకేజీలో ఇవ్వాల్సి ఉంటుంది.

వీటికి అదనంగా చార్జ్‌‌

1. పీపీఈకిట్లు 2. కరోనా టెస్ట్‌‌. 3. సీటీ స్కాన్, ఎంఆర్‌‌‌‌ఐ స్కాన్‌‌, పెట్ స్కాన్ వంటి హైఎండ్ ఇన్వెస్టి గేషన్స్‌‌కు గతేడాది డిసెంబర్‌‌‌‌ నా టికి ఎంత చార్జ్‌‌ ఉందో, ఇప్పుడు కూడా అంతే వసూలుచేయాలి. 4. ఇమ్యునోగ్లోబిన్స్‌‌, మెరోపీనమ్‌‌, పేరెంటల్ న్యూట్రిషన్‌‌, టొసిలిజుమాబ్‌‌ వంటి హైఎండ్ డ్రగ్స్‌‌. వీటికి ఎంఆర్‌‌‌‌పీ ప్రకారం చార్జ్ చేయాలి. 5. కీమోపోర్ట్‌‌ ఇన్సర్ష‌న్‌‌, సెంట్రల్ లైన్‌‌ ఇన్స‌ర్ష‌న్‌ (డైరెక్ట్ మెడ దగ్గరి రక్తనాళాల నుంచి ఫ్లూయిడ్స్‌‌ ఎక్కించడం), కీమో పోర్ట్ ఇన్సర్ష‌న్‌‌, బ్రాంకో స్కోపిక్ ‌‌ ప్రొసీజర్‌‌ ‌‌(ఊపిరితిత్తులలోపల పరిస్థితిని తెలుసుకునేందుకు చేసే ప్రక్రియ), బయాప్సీస్‌ (ఊపిరితిత్తి నుంచి కణజాలాన్ని తీసుకొని పరీక్షించడం), ఎసైటిక్‌‌ లేదా ప్లూరల్ ట్యాపింగ్‌ (లంగ్స్ లేయర్‌‌‌‌లో పేరుకుపోయిన నీరు బయటకు తీయడానికి) వంటి ప్రొసీడర్స్‌‌కు గతేడాది వసూలుచేసినచార్జీలనేర్జీ వసూలుచేయాలి.

ప్యాకేజీ వివరాలు డిస్ ప్లే చేయాల్సిందే

ప్రభుత్వం నిర్ణ‌యించిన ప్యాకేజీల ధరలను, ప్యాకేజీలో కవర్ అవని వాటి చార్జీలను హాస్పిటల్‌లో అందరికీ కనిపించే ప్లేస్‌లో డిస్‌‌ప్లే చేయాలి. అసింప్టమాటిక్‌‌, మైల్డ్ సింప్టమాటిక్ పేషెంట్లను హాస్పిటల్స్‌‌లో అడ్మిట్ చేసుకోవద్దు. వాళ్లకు హోమ్‌‌ ఐసోలేషన్‌‌లో ఉండాలని సూచించాలి. ఇంట్లో వసతులు లేకుంటే గవర్నమెంట్ ఐసోలేషన్‌‌ సెంటర్లకు రిఫర్ చేయాలి. కరోనా టెస్ట్‌‌కు రూ . 2,200 మాత్రమే చార్జ్ చేయాలి. ఇంటికి వెళ్లి శాంపిల్‌‌ సేకరిస్తే రూ. 2,800 చార్జ్‌‌ చేయొచ్చు. కరోనా టెస్టులు చేయించుకున్న ప్రతి ఒక్కరి వివరాలను,వాళ్ల టెస్ట్ రిపోర్నుట్‌‌ ఆరోగ్యశాఖ పోర్ట‌ల్‌ (www.chfw.telangana.gov.in) లోఅప్‌లోడ్ చేయాలి. కరోనా ట్రీట్‌‌మెంట్ చేయాలనుకుంటున్న ప్రతి హాస్పిటల్‌, వెంటనే పబ్లిక్ హెల్త్ డైరెక్ట‌రేట్‌‌కు అప్లయ్ చేసుకోవాలి. ఈ అప్లికేషన్లను, హాస్పిటళ్ల‌ను ఆఫీసర్లు పరిశీలించి పర్మిషన్ ఇస్తారు. అనుమతి పొందిన హాస్పిటళ్లకు పోర్ట‌ల్‌ లో లాగిన్ అవడానికి యూజర్‌‌‌‌ ఐడీ, పాస్‌వర్డ్ కేటాయిస్తారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం

రాష్ట్రంలో కరోనా కేసులు 5,000 దాటినయ్