అభివృద్ధి, సంక్షేమమే బీఆర్ఎస్ లక్ష్యం : తలసాని శ్రీనివాస్ యాదవ్

అభివృద్ధి, సంక్షేమమే బీఆర్ఎస్ లక్ష్యం : తలసాని శ్రీనివాస్ యాదవ్

పద్మారావునగర్, వెలుగు: అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ సర్కారు పనిచేస్తుందని సనత్ నగర్ సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం అమీర్ పేట డివిజన్​లోని బల్కంపేట, వెంకటేశ్వర స్వామి ఆలయం, ఈడబ్ల్యూఎస్, ముస్లిం బస్తీల్లో ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ... రాష్ట్రంలో పక్కా ప్లానింగ్​తో​ అభివృద్ధి జరిగిందన్నారు. సెగ్మెంట్​లో ఎన్నో సమస్యలను పరిష్కరించానని ఆయన తెలిపారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం సుప్రభాత్ నగర్​లో బీఆర్ఎస్ ఆఫీసును ఆయన ప్రారంభించారు. సనత్ నగర్ లోని ఏకే గౌడ్ ఫంక్షన్​ హాల్​లో ఆర్ఎస్ఎంఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాల్ రెడ్డి ఆయన వెంట ఉన్నారు. ఇటీవల మరణించిన మాజీ కార్పొరేటర్ శీలం ప్రభాకర్ దశదిన కర్మ బుధవారం మున్నూరు కాపు సంఘం భవనంలో జరగగా.. తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై నివాళులర్పించారు. బన్సీలాల్ పేట, జయప్రకాశ్​ నగర్, కీస్ బ్లాక్, వడ్డెర బస్తీ, జైనగర్, జయ నగర్, ఐడీహెచ్ కాలనీ, బోయిగూడ ప్రాంతాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు.

కేటీఆర్ రోడ్ షో..

సికింద్రాబాద్: మంగళవారం రాత్రి సనత్​నగర్​లోని మహంకాళి టెంపుల్, బల్కంపేట ఆలయం, ఇతర ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు.  బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిత్యం జనాల్లో ఉంటూ ప్రజా సేవనే రాజకీయ జీవితంగా మార్చుకున్నారన్నారు.  మరోసారి ఆయనను గెలిపించుకోవాలన్నారు.