గచ్చిబౌలి, వెలుగు : అభివృద్ధి, సంక్షేమం నినాదంతో రూ. 9 వేల కోట్ల నిధులతో శేరిలింగంపల్లి సెగ్మెంట్ను డెవలప్ చేశామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అరికెపూడి గాంధీ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్తో కలిసి డివిజన్లోని ప్రేమ్ నగర్, బీ బ్లాక్, ఏ బ్లాక్, మార్తాండ్ నగర్, హనీఫ్ కాలనీలో ఆయన ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిశారు.
ఈ సందర్భంగా అరికెపూడి గాంధీ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ కు గెలుపునకు పునాది అని అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ మరోసారి అత్యధిక మెజార్టీ స్థానాలతో గెలుపొంది అధికారంలోకి వస్తుందన్నారు.