
అబ్దుల్లాపూర్మెట్, వెలుగు: రాజకీయాలకతీతంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో డెవలప్ చేస్తానని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని అబ్దుల్లాపూర్, కవాడిపల్లి, బండరావిరాల, చిన్నరావిరాల, బాటసింగారం, జఫర్గూడ, ఇనాంగూడ, లష్కర్గూడ గ్రామాల్లో బుధవారం స్థానిక నాయకులతో కలిసి వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి చొరవతో రానున్న మూడున్నరేళ్లలో నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని మాటిచ్చారు. కార్యక్రమంలో గడ్డిఅన్నారం మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్రెడ్డి, వైస్ చైర్మన్ భాస్కరాచారి, మాజీ ఎంపీపీ రేఖామహేందర్గౌడ్, మాజీ ఎంపీటీసీ వెంకటేశ్, గౌస్పాషా పాల్గొన్నారు.