నియోజకవర్గాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తా ..ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి

నియోజకవర్గాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తా  ..ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి

అబ్దుల్లాపూర్​మెట్, వెలుగు: రాజకీయాలకతీతంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో డెవలప్​ చేస్తానని ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్​మెట్ మండలంలోని అబ్దుల్లాపూర్, కవాడిపల్లి, బండరావిరాల, చిన్నరావిరాల, బాటసింగారం, జఫర్​గూడ, ఇనాంగూడ, లష్కర్​గూడ గ్రామాల్లో బుధవారం స్థానిక నాయకులతో కలిసి వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం రేవంత్​రెడ్డి చొరవతో రానున్న మూడున్నరేళ్లలో నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని మాటిచ్చారు. కార్యక్రమంలో గడ్డిఅన్నారం మార్కెట్ చైర్మన్​ చిలుక మధుసూదన్​రెడ్డి, వైస్​ చైర్మన్​ భాస్కరాచారి, మాజీ ఎంపీపీ రేఖామహేందర్​గౌడ్​, మాజీ ఎంపీటీసీ వెంకటేశ్​, గౌస్​పాషా పాల్గొన్నారు.