టీఆర్ఎస్ తోనే అన్నివర్గాల అభివృద్ధి సాధ్యం

టీఆర్ఎస్ తోనే అన్నివర్గాల అభివృద్ధి సాధ్యం

కోనరావుపేట, వెలుగు : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, టీఆర్ఎస్ తోనే అన్నివర్గాల అభివృద్ధి జరుగుతుందని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్​బాబు అన్నారు. శనివారం కోనరావుపేటతోపాటు మామిడిపల్లి, అజ్మీరా తండా, నిజామాబాద్, మర్తనపేట, కొలనూర్ గ్రామాల్లో జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ తో కలిసి రూ.12కోట్ల పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. అనంతరం రూ.కోటీ 36 లక్షల విలువగల చెక్కులను 136 మంది లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన 20మంది యువకులు మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య ఆధ్వర్యంలో టీఆర్​ఎస్​లో  చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పర్శరాములు తదితరులు పాల్గొన్నారు.