ఏడుపాయలను పర్యాటక క్షేత్రంగా చేస్తాం : హరీష్ రావు

ఏడుపాయలను పర్యాటక క్షేత్రంగా చేస్తాం : హరీష్ రావు

రాబోయే రోజుల్లో ఏడుపాయలను పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి హరీష్ రావు మహా శివరాత్రి శుభాకాంక్షల తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాలకు అదర్శశంగా నిలుస్తోందన్న ఆయన.. రాష్ట్రం ఏర్పడ్డాక ఏడుపాయలకు యేటా నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం మరింత ముందుకు సాగుతోందని, రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను తెలంగాణ సర్కార్ అభివృద్ధి చేస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు గర్వించేటట్టుగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ బడ్జెట్ లో దేవాలయ అభివృద్ధికి కృషిచేస్తున్నామన్న మంత్రి.. వేద పండితులు, బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని చెప్పారు.

దేవాలయ ఉద్యోగుల సంక్షేమం కోసం కృషిచేస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. అంతకుముందు ఏడుపాయలలో ప్రారంభమైన మహా శివరాత్రి జాతర ఉత్సవాలకు హాజరైన మంత్రి హరీష్ రావు.. దుర్గమ్మ తల్లికి ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు  ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. వేద పండితుల నడుమ పూర్ణ కుంభంతో మంత్రికి, ఎమ్మెల్యేలకు ఛైర్మన్ బాలాగౌడ్ స్వాగతం పలికారు, అనంతరం వనదుర్గ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు.