శ్రీవారి సన్నిధిలో ఆత్మహత్య.. వైరలవుతున్న వీడియో..

శ్రీవారి సన్నిధిలో ఆత్మహత్య.. వైరలవుతున్న వీడియో..

తిరుమల శ్రీవారి ఆలయం ముందు విషాదం చోటుచేసుకుంది. పాల వ్యాను కింద పడి తమిళనాడుకు చెందిన భక్తుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రతి రోజు స్వామివారి కైంకర్యాలు మరియు ప్రసాదాల కోసం తెల్లవారుజామున ప్రధాన ఆలయానికి పాలు సరఫరా చేస్తారు. ఈ రోజు ఉదయం 5:30లకు ఆలయం ముందు పాల డబ్బాలు దించిన అనంతరం పాల వ్యాను తిరిగి వెళ్లే సమయంలో వ్యాను వెనుక చక్రాల క్రింద పడి భక్తుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మొదట డ్రైవర్ నిర్లక్ష్యంతోనే భక్తుడు మృతి చెందాడని డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు షాక్‌కు గురయ్యారు. భక్తుడు మృతి చెందింది డ్రైవర్ నిర్లక్ష్యంతో కాదని తేలింది. ఆ భక్తుడుకి ఏం కష్టం వచ్చిందో లేక స్వామి సన్నిధిలో ప్రాణాలు తీసుకోవానుకున్నాడో ఏమో కాని తనకు తానుగా వెళ్లి వ్యాన్ వెనుక చక్రాల కింద తల పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.