కేరళ శబరిమలలో మకరజ్యోతి దర్శనం కోసం భక్తులు పెద్దఎత్తున చేరుకుంటున్నారు. పంబా, పులిమేడ్ , నీలికల్ కు వేలాది మంది తరలివస్తుండటంతో శబరిగిరి అయ్యప్ప నామస్మరణతో మారుమోగుతోంది. అటు పంబాలో స్వాములు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మకరజ్యోతి దర్శన సమయానికి శబరిమలలో లక్షలాది మంది స్వాములు ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఇవాళ(జనవరి 15) సాయంత్రం ఆరున్నర గంటల నుంచి రాత్రి ఏడున్నర టైమ్ లో మకర జ్యోతి దర్శనం ఉంటుందని ఆలయాధికారులు తెలిపారు. భక్తుల కోసం ప్రత్యేక వ్యూ పాయింట్లను ఏర్పాటు చేశారు.