
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. శనివారం నుంచి ఆలయనికి చేరుకున్న భక్తులు ఆదివారం ఉదయం మల్లన్న కోనేరులో స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. పట్నాలు వేసి, గంగిరేగు చెట్టుకు ముడుపులు కట్టారు. దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. అనంతరం మల్లన్న కొండపైన రేణుక ఎల్లమ్మ,నల్ల పోచమ్మ అమ్మవార్లను దర్శించుకొని బోనాలు సమర్పించారు.
ఆలయ ఈవో అన్నపూర్ణ, ఏఈవో శ్రీనివాస్, ఆలయ ప్రధానార్చకుడు మల్లికార్జున్, పర్యవేక్షకుడు శ్రీరాములు, సురేందర్ రెడ్డి, ధర్మకర్తలు శ్రీనివాస్, అంజిరెడ్డి, ఆలయ సిబ్బంది భక్తులకు సేవలందిచారు. దేవాదయ కమిషనర్ ఆదేశాల మేరకు ఆలయంలో భక్తులు విరాళాలు చెల్లించేందుకు ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేశారు.