
కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. శనివారం సాయంత్రం నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు ఆదివారం ఉదయం మల్లన్న కోనేరులో స్నానం చేసి స్వామివారి దర్శనానికి క్యూ కట్టారు. మల్లన్న స్వామిని దర్శించుకొని పట్నాలు వేసి, గంగిరేగు చెట్టుకు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం మల్లన్న గుట్టపై ఉన్న రేణుక ఎల్లమ్మ, నల్లపోచమ్మ అమ్మవార్లను దర్శించుకొని బోనాలు సమర్పించారు. ఆలయ ఈవో అన్నపూర్ణ, ఏఈవో శ్రీనివాస్, ఆలయ ప్రధాన అర్చకుడు మల్లికార్జున్, పర్యవేక్షకుడు శ్రీరాములు, సురేందర్, ధర్మకర్తలు శ్రీనివాస్, అంజిరెడ్డి భక్తులకు సేవలందిచారు.