కాళేశ్వరానికి పోటెత్తిన భక్తులు.. స్వామివారికి ప్రత్యేక పూజలు

కాళేశ్వరానికి పోటెత్తిన భక్తులు.. స్వామివారికి ప్రత్యేక పూజలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరానికి భక్తులు పోటెత్తారు. నవంబర్ 26 ఆదివారం సెలవు రోజు కావడంతో సుదూర ప్రాంతాలతో పాటు మహరాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచి కాళేశ్వరానికి భక్తులు తరలి వస్తున్నారు. 

కార్తీక మాసం కావడంతో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి.. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి.. ఉసిరిచెట్టు దగ్గర మహిళలు దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.