అమ్మవారికి రెండో బోనం..గోల్కొండకు పోటెత్తిన భక్తులు

అమ్మవారికి రెండో బోనం..గోల్కొండకు పోటెత్తిన భక్తులు

హైదరాబాద్: చారిత్రాత్మక గోల్కొండ కోటలో ఈ నెల 26వ తేదీ నుంచి ఆషాడ బోనాల ఉత్స వాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా రెండో పూజ ఆదివారం కావడంతో గోల్కొండ కోటకు భక్తుల తాకిడి పెరిగింది. దీంతో ఇవాళ తెల్లవారుజామునుంచే భక్తులు గోల్కొండకు చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ సందర్భంగా గోల్కొండ కోట పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

 దీంతో గోల్కొండ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. గొల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి ప్రతి గురు, ఆదివారాల్లో భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించనున్నారు.అమ్మవార్లకు 9 పూజలతో గోల్కొండ బోనాలు జరుగుతాయి. గోల్కొండ కోటలో నెలరోజుల పాటు బోనాల ఉత్సవాలు జరగనున్నాయి.గోల్కొండ కోటాలో మొదలైన బోనాలు జులై 24న తిరిగి గోల్కొండ కోటలో వేడుకలు ముగియనున్నాయి.