- వికటించాయంటూ పేరెంట్స్ ఆందోళన
- బోయిన్పల్లి మౌంట్ కార్మెన్ స్కూల్లో నలుగురు స్టూడెంట్లకు వాంతులు, విరేచనాలు
కంటోన్మెంట్, వెలుగు: బోయిన్ పల్లిలోని మౌంట్ కార్మెల్ స్కూల్లో పిల్లలకు వేసిన నులి పురుగు మాత్రలు వికటించాయని పేరెంట్స్ గురువారం ఆందోళనకు దిగారు. పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ సీమ తెలిపిన వివరాల ప్రకారం.. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో బోయిన్పల్లిలోని మౌంట్ కార్మెల్ స్కూల్లో పిల్లలకు మాత్రలు వేశారు. కొద్దిసేపటికి నలుగురు స్టూడెంట్లు వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పేరెంట్స్ స్కూల్ ఎదుట ఆందోళన చేశారు. ఈ విషయమై మెడికల్ ఆఫీసర్ సీమ తల్లిదండ్రులతో మాట్లాడుతూ.. పిల్లలకు ఎలాంటి ప్రమాదం లేదని ఇప్పటికే 30 స్కూళ్లలో 900 మందికి మాత్రలు వేశామన్నారు. మాత్రలు వేసినప్పుడు కడుపులో నులిపురుగులు ఉన్న వారికి కడుపు నొప్పి, వాంతులు అవుతాయని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన విరమించారు.