‘ఎలాంటి కుట్ర లేదు..రాజకీయం చేయొద్దు’
డ్రోన్ వివాదంపై స్పందించిన డీజీపీ
విజయవాడ: ఇకపై డ్రోన్ ఉపయోగించాలంటే స్థానిక పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు డీజీపీ గౌతమ్ సవాంగ్. మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపైన ఎగరేసిన డ్రోన్ వివాదంపై డీజీపీ స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..స్థానిక పోలీసులకు సమాచారం లేకపోవడంతో కమ్యూనినేషన్ గ్యాప్ వచ్చిందని వివరణ ఇచ్చారు.
వరద ఉధృతిని అంచనా వేయడం కోసం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డ్రోన్ ఉపయోగించిందన్నారు. ఇందులో ఎలాంటి కుట్ర లేదని స్పష్టం చేశారు. దీనిని రాజకీయం చేయొద్దని..ఇరిగేషన్ అధికారులకు, స్థానిక పోలీసులకు మధ్య సమన్వయం లేని కారణంగానే ఈ వివాదం నెలకొందన్నారు.