అక్టోబర్ 1న జటాధర నుంచి ధన పిశాచి పాట విడుదల

అక్టోబర్ 1న  జటాధర నుంచి ధన పిశాచి పాట విడుదల

బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాకు టాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ  ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె తెలుగులో నటిస్తున్న చిత్రం ‘జటాధర’. సుధీర్ బాబు  హీరోగా  అభిషేక్ జైస్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సోనాక్షి విలన్ రోల్ పోషిస్తుంది. ఇప్పటికే ఆమె లుక్ రివీల్ చేయగా మరో స్పెషల్ పోస్టర్‌‌‌‌‌‌‌‌తో ఫస్ట్ సాంగ్ అప్‌‌‌‌డేట్ ఇచ్చారు మేకర్స్. 

అక్టోబర్ 1న ‘ధన పిశాచి’ అంటూ సాగే పాటను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన  సోనాక్షి సిన్హా పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆసక్తిని పెంచుతోంది. ఇందులో ఆమె ధన పిశాచిగా కనిపిస్తున్నట్టుగా చూపించారు.  సూపర్ నేచురల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మైథలాజికల్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రెర్ణా అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో దీన్ని  రూపొందిస్తున్నారు.  

నవంబర్ 7న వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సినిమా  విడుదల కానుంది.  ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది.  సుధీర్ బాబు, సోనాక్షి సిన్హాతో పాటు దివ్యా ఖోస్లా, శిల్పా శిరోధ్కర్, ఇంద్రకృష్ణ, రవి ప్రకాష్, నవీన్ నేని, రోహిత్ పాఠక్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకులకు గ్రేట్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీరియెన్స్ ఇవ్వడంతోపాటు ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తుందని మేకర్స్ చెప్పారు.