మాస్కులు కుడుతున్న కేంద్ర మంత్రి భార్య, కూతురు

మాస్కులు కుడుతున్న కేంద్ర మంత్రి భార్య, కూతురు
  • నైపుణ్యాలను పెంచుకునేందుకు ఇదే టైం 
  •  ఫొటోలు ట్వీట్‌ చేసిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ భార్య, కూతురు మాస్కులు తయారు చేస్తున్నారు. కరోనా నుంచి కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా అందరూ మాస్కులు వేసుకుని బయటకు రావాలన్న కేంద్ర ప్రభత్వ సూచన మేరకు తమ ఇంట్లో వారికి, అవసరమైన మరికొంత మందికి మాస్కులు తయారు చేస్తున్నారు.

“ మనలో ఉన్న నైపుణ్యాన్ని పెంచుకునేందుకు, కొత్త విద్యలు నేర్చుకునేందుకు ఇదో మంచి అవకాశం. ఈ కష్టకాలంలో దేశానికి మన వంతుగా ఏదో ఒకటి చేయాలి. నా భార్య మృదులా, కూతురు నైమిషాను చూసి గర్వపడుతున్నాను” అని ధర్మేంద్ర ప్రధాన్‌ ట్వీట్‌ చేశారు. జనాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో, బయటకు వెళ్లినప్పుడు మాస్క్‌ కచ్చితంగా వాడాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే సూచించింది.