న్యాయం చేయాలని అడ్వకేట్ ఇంటి ముందు ధర్నా

న్యాయం చేయాలని అడ్వకేట్ ఇంటి ముందు ధర్నా

ఆర్మూర్, వెలుగు : తమకు న్యాయం చేయాలని కోరుతూ చేపూర్ గ్రామానికి చెందిన బండ గంగాధర్ (56) కుటుంబసభ్యులు, బంధువులు సోమవారం ఆర్మూర్ లో అడ్వకేట్​సదానందం ఇంటి ముందు ధర్నా చేశారు. గంగాధర్​కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం రెండు హత్యకేసుల్లో జైలుకు వెళ్లిన గంగాధర్, అనారోగ్య కారణాలతో బెయిల్​పై వచ్చాడు. చేపూర్​కు చెందిన విజయ్​కుమార్​సహాయంతో లాయర్​సదానందం వద్ద రూ.10 లక్షలు అప్పు తీసుకున్నాడు.

అప్పు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో ఇతడి మూడెకరాల భూమిని విజయ్, సదానందం ఆక్రమించేందుకు ప్రయత్నించారు. తన భూమిని లాక్కుంటున్నారని ఆవేదన చెందిన గంగాధర్​ఆదివారం రాత్రి లాయర్ సదానందం ఇంటి ముందు తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు.

లాయర్ సదానందం, విజయ్ ఒత్తిడి కారణంగానే గంగాధర్​సూసైడ్​చేసుకున్నాడని సోమవారం సదానందం ఇంటి ముందు ధర్నాకు దిగారు. సీఐ రవికుమార్ ఘటనా స్థలానికి చేరుకొని న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.