దళిత బంధు కోసం గ్రామ పంచాయతీ ఎదుట ధర్నా

దళిత బంధు కోసం గ్రామ పంచాయతీ ఎదుట ధర్నా

నల్లగొండ జిల్లా : దళితబంధు పథకం తమకు కూడా ఇవ్వాలంటూ అర్హులు ఆందోళన బాట పడుతున్నాయి. అధికార పార్టీ నాయకులు సూచించిన వారికే పథకం మంజూరు చేస్తుండటాన్ని నిరసిస్తూ ఆందోళనలకు దిగుతున్నారు. తాజాగా చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామ పంచాయితీ కార్యాలయం ముందు దళిత కుటుంబాలు ఆందోళన చేపట్టాయి. 

దళిత బంధు లబ్దిదారుల ఎంపిక విషయంలో తమకు నచ్చిన వారికే సర్పంచ్ ఇచ్చారని ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు వారి అనుచరులకే ఇచ్చుకుంటున్నారని, సామాన్యులను, అసలైన అర్హులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నిజమైన పేద కుటుంబాలను లబ్దిదారులుగా ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు.