ఆడపిల్ల పుడితే రూ. 5వేలు అందజేస్తున్న ధూల్మిట్ట గ్రామ సర్పంచ్

ఆడపిల్ల పుడితే రూ. 5వేలు అందజేస్తున్న ధూల్మిట్ట గ్రామ సర్పంచ్

చేర్యాల, వెలుగు: సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట గ్రామ పంచాయతీ సర్పంచ్​ గునుకుల లీలా జగన్​మోహన్​రెడ్డి ఆడపిల్ల పుడితే రూ. 5వేలు అందజేస్తున్నారు. గతంలో కూడా పేదింటి ఆడపిల్లకు పెళ్లి సందర్భంగా పుస్తె మట్టెలు పంపిణీ చేశారు. శుక్రవారం ధూల్మిట్ట గ్రామానికి చెందిన సుద్దాల స్వర్ణలత బాబు కూతురు మేఘనకు రూ.5వేలఫిక్స్​డ్​ డిపాజిట్​ చేసి పత్రాలను తల్లిదండ్రులకు అందజేశారు. 

ఈ సందర్భంగా సర్పంచ్​ లీలా జగన్​మోహన్​రెడ్డి మాట్లాడుతూ.. ఈ పథకాన్ని కొనసాగిస్తూనే కాంగ్రెస్​ ప్రభుత్వం సహకారంతో ఆర్హలందరికీ సంక్షేమ పథకాలను అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ తుషాలపురం రాజు, మాజీ జడ్పీటీసీ గిరి కొండల్​ రెడ్డి, జాలపల్లి సర్పంచ్​ చెట్కూరి కమలాకర్​ యాదవ్​, కాంగ్రెస్​ గ్రామ శాఖ అధ్యక్షుడు చెప్యాల అనిల్, వార్డు మెంబర్లు, గ్రామ స్థాయి నాయకులు పాల్గొన్నారు.