
- విలీనానికి ముందు డీటీసీపీకి 45 మంది దరఖాస్తులు
- ఫీజులు చెల్లించినా అనుమతియ్యలే
- ఈలోపే హెచ్ఎండీఏలో పలు గ్రామాల విలీనం
- హెచ్ఎండీఏ వద్దకే పోవాలంటున్న ‘డీటీసీపీ’
- కొత్తగా అప్లై చేసుకోవాలంటున్న హెచ్ఎండీఏ
హైదరాబాద్సిటీ, వెలుగు: హెచ్ఎండీఏ, డైరెక్టర్టౌన్అండ్కంట్రీ ప్లానింగ్(డీటీసీపీ) మధ్య కోల్డ్వార్నడుస్తోంది. హెచ్ఎండీఏ పరిధి విస్తరించకముందు హెచ్ఎండీఏ వెలుపలి ప్రాంతాల్లోని అన్ని గ్రామాలు, పట్ణణాల్లో భారీ నిర్మాణాలు, లేఔట్ల పర్మిషన్లన్నీ డీటీసీపీ మంజూరు చేస్తూ వచ్చింది. కానీ,తాజాగా హెచ్ఎండీఏ పరిధిని రీజినల్ రింగ్రోడ్(ట్రిపుల్ఆర్) వరకూ విస్తరించారు. అంతకుముందు నిర్మాణాలు, కొత్త లేఔట్ల పర్మిషన్ల కోసం డీటీసీపీకే దరఖాస్తు చేసుకున్నారు. అవసరమైన ఫీజులు కూడా కట్టారు. అయితే, పర్మిషన్లు రాకముందే హెచ్ఎండీఏ పరిధిని విస్తరించడంతో ప్రస్తుతం డీటీసీపీ వద్ద ఉన్న దరఖాస్తులకు ఎవరు అనుమతులు ఇవ్వాలన్న విషయంపై ఇరు శాఖల మధ్యకోల్డ్వార్నడుస్తోంది.
దరఖాస్తుదారులు డీటీసీపీ వద్దకు వెళ్తే మీ దరఖాస్తులు హెచ్ఎండీఏ పరిధిలోకి వెళ్లాయని వారు, హెచ్ఎండీఏ వద్దకు వెళ్తే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని చెప్తుండడంతో ఏం చేయాలో తెలియక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము డీటీసీపీకి అవసరమైన ఫీజులు చెల్లించినా అనుమతులు ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కొంతమందయితే, తమ సమస్య వెంటనే పరిష్కరించాలని ఎంఏయూడీకి ఫిర్యాదు కూడా చేశారు. చివరకు ఈ దరఖాస్తుల గొడవ సీఎం వరకూ చేరినట్టు సమాచారం.
హెచ్ఎండీఏ విస్తరణతో..
హెచ్ఎండీఏ పరిధి ఇంతకుముందు ఏడు జిల్లాలకు విస్తరించి ఉండగా, గత మార్చి 12వ తేదీన హెచ్ఎండీఏ పరిధిలోకి మరో నాలుగు జిల్లాలను చేర్చారు. 104 మండలాలు , 1355 గ్రామాలను విలీనం చేశారు. దీంతో ఇదివరకు హెచ్ఎండీఏ పరిధి 7,252 చ.కి.మీ ఉండగా, ప్రస్తుతం 10,472 చ. కి.మీ.లకు విస్తరించింది. గతంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, యాదాద్రి, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలు మాత్రమే హెచ్ఎండీఏ పరిధిలో ఉండగా, మార్చి నెలలో జీవో 68 ద్వారా నల్గొండ, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వికారాబాద్జిల్లాలను కూడా హెచ్ఎండీఏ పరిధిలోకి తెచ్చింది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలోని 533 గ్రామాలు, మేడ్చల్లోని163, యాదాద్రి జిల్లాలోని162, సంగారెడ్డిలోని 151, మెదక్లోని10 , సిద్దిపేటలోని 74, వికారాబాద్లోని 54, మహబూబ్నగర్లోని 19, నల్గొండలోని 31, నాగర్ కర్నూల్లోని 3 గ్రామాలు హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చాయి.
ఇంతకుముందు ఈ గ్రామాల్లో నిర్మాణ అనుమతులు, లేఔట్ల పర్మిషన్లు డీటీసీపీ మంజూరు చేసేది. తాజాగా విలీనంతో ఇక నుంచి హెచ్ఎండీఏ నుంచే పర్మిషన్లు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. గ్రామాల విలీనం తర్వాత ప్రభుత్వం నుంచి ఎలాంటి గైడ్లైన్స్విడుదల కాకపోవడంతో ఇప్పటికే డీటీసీపీకి చేసుకున్న దరఖాస్తులన్నీ ఆటోమేటిక్గా హెచ్ఎండీఏకు వెళ్లిపోయాయి. కానీ, అప్పటికే దరఖాస్తుచేసుకున్న వారంతా అవసరమైన ఫీజులను డీటీసీపీకే చెల్లించారు. అయితే, తమకు పర్మిషన్లు ఇచ్చే అధికారం లేదని, హెచ్ఎండీఏ వద్దకే వెళ్లాలని చెప్తున్నారు. హెచ్ఎండీఏ దగ్గరకు వెళ్తే దరఖాస్తులకు సంబంధించి ఫీజులు తమకు రాలేదని, కాబట్టి ఫ్రెష్గా దరఖాస్తు చేసుకోవాలని చెప్తున్నారని నిర్మాణ దారులు వాపోతున్నారు.
సీఎంఓకు చేరిన పంచాది !
ఎటూ తేల్చకపోవడంతో డీటీసీపీ పర్మిషన్కోసం దరఖాస్తు చేసుకుని డబ్బులు కట్టిన సుమారు 40 మంది నిర్మాణదారులు తమ పరిస్థితిని వివరిస్తూ ఎంఏయూడీ అధికారులను ఆశ్రయించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఉన్నతాధికారులు చెప్తున్నారు. సీఎంవో నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగానే సదరు దరఖాస్తులకు ఎవరు అనుమతులు జారీ చేయాలన్నది నిర్ణయిస్తారని చెప్తున్నారు.