టీమిండియాకు ధోనీ దావత్

టీమిండియాకు ధోనీ దావత్

రాంచీ : జార్ఖండ్ లో శుక్రవారం ఇండియా- ఆస్ట్రేలియా జట్ల మధ్య ముూడో వన్డే జరగబోతోంది. నాగ్ పూర్ లో రెండో వన్డే లో గెలిచిన తర్వాత గురువారం నాడు రాంచీకి చేరుకుంది టీమిండియా. సొంత ప్లేస్ కావడంతో.. తన ఇంటికి జట్టు సభ్యులను డిన్నర్ కి పిలిచి దావత్ ఇచ్చాడు సీనియర్ ప్లేయర్, వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ.

మహి ఇంట్లో డిన్నర్ కు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సహా జట్టు సభ్యులు, కోచ్ లు, ఫిజియోలు.. ఇలా టీమ్ అంతా అందరూ వచ్చారు. మంచి ఫుడ్డు తిన్నామనీ… టీమ్ తో చాలాసేపు ఆనందంగా గడిపామని కెప్టెన్ కోహ్లీ, బౌలర్ యజువేంద్ర చాహల్ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్ చేశారు. ధోనీ భాయ్ కి, సాక్షి వదినకు థాంక్స్ అని బౌలర్ చాహల్ అన్నాడు. ధోనీ దావత్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.