
బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తవగా, ఇటీవల మరో షెడ్యూల్ను కంప్లీట్ చేశారు. రాజస్థాన్లోని జైపూర్లో మోస్ట్ ఇంటెన్స్ షెడ్యూల్ను పూర్తి చేసినట్టు దర్శకుడు బాబీ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ‘ఇందులో బాలకృష్ణ గారి ఎనర్జీని ఎవరూ మ్యాచ్ చేయలేరు. ఆయన చేసిన యాక్షన్ సీక్వెన్స్ను చూసేందుకు రెడీగా ఉండండి’ అంటూ బాబీ పోస్ట్ చేయడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
అలాగే త్వరలోనే టైటిల్ టీజర్ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించాడు. ఈ సందర్భంగా బాలకృష్ణతో దిగిన సెల్ఫీని బాబీ పోస్ట్ చేశాడు. బాలకృష్ణ కెరీర్లో ఇది 109వ చిత్రం. ఊర్వశీ రౌతేలా, బాబీ డియోల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. బాలకృష్ణకు ఉన్న మాస్ ఫాలోయింగ్ దృష్ట్యా ఈ చిత్రానికి ‘వీర మాస్’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.