వ్యవస్థను ప్రశ్నించే  ప్రతినిధి 2 

వ్యవస్థను ప్రశ్నించే  ప్రతినిధి 2 

నారా రోహిత్ హీరోగా మూర్తి దేవగుప్తపు తెరకెక్కించిన చిత్రం ‘ప్రతినిధి 2’. రజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మించారు. ఏప్రిల్ 25న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ ‘ఏ పార్టీని టార్గెట్‌‌‌‌‌‌‌‌ చేస్తూ ఈ సినిమా తీయలేదు. వ్యవస్థను ప్రశ్నించే చిత్రంగా రూపొందించాం. ప్రస్తుత రాజకీయాల గురించి, ప్రజల భావజాలం గురించి బలంగా చర్చించాం.

ప్రతి జర్నలిస్ట్‌‌‌‌‌‌‌‌కి ప్రతిరూపంగా ఇందులో నారా రోహిత్ పాత్ర ఉంటుంది. అందరిలో ఆలోచన రేకెత్తించే కమర్షియల్ సినిమా ఇది. రోహిత్ వాయిస్ ఈ కథకి మరింత బలం చేకూర్చుతుంది. సచిన్ ఖేడ్కర్, జిషు సేన్ గుప్తా, అజయ్ ఘోష్, తనికెళ్ళ భరణి, ఇంద్రజ వంటి బెస్ట్ ఆర్టిస్టులు ఇందులో నటించారు. ఇకపై దర్శకుడిగానూ కొనసాగాలి అనుకుంటున్నా. నాలుగు కథలు రెడీగా ఉన్నాయి’ అని చెప్పారు.