ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల(Srinu vaitla) ఇంట విషాదం నెలకొంది. ఆయన ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న ఆవు చనిపోయింది. ఇదే విషయాన్ని శ్రీను వైట్ల సోషల్ మీడియా విదేకగా ప్రకటించారు.. నేను మొదటిసారి ఇంటికి తెచ్చుకున్న ఆవు చనిపోయింది అని చెప్పడానికి చాలా బాధగా ఉంది. 13 ఏళ్లుగా మా కుటుంబంలో ఒక సభ్యురాలిగా ఉంది. ఎంతో ప్రేమగా చూసుకున్నాము. నా కూతురు ప్రేమగా ఆ ఆవును లక్ష్మీ అని పిలుచుకునేది.. అంటూ ట్విటర్లో ఎమోషనల్ పోస్ట్ చేశారు శ్రీను వైట్ల. దీంతో పాటు ఆవు ఫోటోను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Feeling very sad to lose the first cow in my farm..
— Sreenu Vaitla (@SreenuVaitla) September 14, 2023
We all loved her and treated like a family member for 13 years!!
My daughters affectionately called her "Lakshmi".
Bidding farewell with all rituals.. pic.twitter.com/736pzfJmSJ
ఇక శ్రీనువైట్ల సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన మ్యాచో హీరో గోపీచంద్తో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.