
యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా ఆరేళ్ల క్రితం వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది’చిత్రానికి సీక్వెల్ను ఆదివారం ప్రకటించారు. ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’టైటిల్తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ఓ క్రేజీ వీడియోతో అనౌన్స్ చేశారు.‘బ్రో దిస్ ఈజ్ అవర్ వైబ్. బ్రో ఇది మళ్లీ వస్తుంది.
మోస్ట్ ఐకానిక్ కన్యా రాశి గ్యాంగ్ ఈజ్ బ్యాక్’అంటూ సోషల్ మీడియా వేదికగా మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు.‘ఏలి నాటి శని వదిలిపోయింది. కన్యా రాశి టైం వచ్చింది’ అంటూ పోస్ట్ చేయడం సినిమాపై ఆసక్తిని పెంచింది.
ఫస్ట్ పార్ట్లో అలరించిన గ్యాంగ్ విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను మరోసారి మ్యాడ్నెస్ క్రియేట్ చేయబోతున్నారు. తరుణ్ భాస్కర్ ఈ సీక్వెల్కు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. సురేష్ బాబు, సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.
7 years ago, one Goa trip went off-script… and created a classic.
— Suresh Productions (@SureshProdns) June 29, 2025
The film may have ended but the love, the memes and the one-liners never did!
Thank you for keeping the madness alive, always❤️#7YearsOfEeNagaranikiEmaindi#7YearsOfENE#ENERepeat loading 🍻#TharunBhascker… pic.twitter.com/TIsnfOceKl