
- గాంధీ భవన్లో వికలాంగుల కార్యక్రమం
హైదరాబాద్, వెలుగు: వికలాంగు లను వికలాంగులే వివాహం చేసు కుంటే రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేయడంపై రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేస్తూ శనివారం గాంధీ భవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటోకు వికలాంగులు పాలాభిషేకం చేశారు.
వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రోగ్రాంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మానవతా దృక్పథంతో వ్యవహరించి.. ఈ జీవో జారీ చేసినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు.