గజ్వేల్​లో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించుకుంటం: బీఆర్ఎస్ ​అసంతృప్త నేతలు

గజ్వేల్​లో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించుకుంటం: బీఆర్ఎస్ ​అసంతృప్త నేతలు

గజ్వేల్​, వెలుగు: గజ్వేల్​లో బీజేపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్​పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరుతున్నారని బీఆర్ఎస్​ అసంతృప్త నాయకుడు గాడిపల్లి భాస్కర్​అన్నారు. బుధవారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో కాంగ్రెస్​ లీడర్ ​మాదాడి జశ్వంత్​రెడ్డితో కలిసి మాట్లాడారు. గజ్వేల్​లో ఈటల రాకతో బీజేపీ గెలుపు ఖాయమైందని,  సీఎం కేసీఆర్​పతనం ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందన్నారు. 

తనతో పాటు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్​ లీడర్లు పార్టీకి రాజీనామా చేసి గురువారం బీజేపీలో చేరనున్నట్టు చెప్పారు. మాదాడి జశ్వంత్​ రెడ్డి మాట్లాడుతూ తాను కాంగ్రెస్​కు రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నానని, కలిసికట్టుగా కృషి చేసి ఈటల రాజేందర్​ను గెలిపించి తీరతామన్నారు. గజ్వేల్​ ఏఎంసీ మాజీ చైర్మెన్​ టేకులపల్లి రామ్​రెడ్డితో పాటు పలువురు బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ నాయకులు పాల్గొన్నారు.