శంషాబాద్, వెలుగు: శంషాబాద్ మండలం హమీదుల్లా నగర్ గ్రామంలో నిర్మించిన 20 డబుల్బెడ్రూమ్ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. స్థానిక రైతు వేదికలో బుధవారం పంపిణీ కార్యక్రమం నిర్వహించగా, రాజేంద్రనగర్ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్పాల్గొని లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. మొత్తం 149 మంది ఆన్లైన్లో డబుల్బెడ్రూమ్ ఇల్లు కోసం అప్లై చేసుకోగా, అధికారులు 25 మందిని ఎంపిక చేశారు.
లక్కీ డ్రాలో 20 మందికి ఇల్లు వచ్చాయి. దీంతో మిగిలిన ఐదు మంది ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, సర్పంచ్సతీశ్యాదవ్తో వాగ్వాదానికి దిగారు. సర్పంచ్ వారికి సర్దిచెప్పారు. ఎమ్మెల్యేతో మాట్లాడి డబుల్బెడ్రూమ్ఇల్లు లేదా దళితబంధు స్కీం వచ్చేలా చూస్తానన్నారు. ఖాళీ స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం నుంచి రూ.3లక్షలు ఇప్పించేందుకు కృషి చేస్తానని చెప్పడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో తహసీల్దార్శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ జయమ్మ, ఆర్ఐ సంజీవ పాల్గొన్నారు. అయితే వార్డు సభ్యులు, బీఆర్ఎస్గ్రామ అధ్యక్షుడు, ఎస్సీ సెల్అధ్యక్షుడు కుమ్మక్కై డబుల్బెడ్రూమ్ఇండ్లను అమ్ముకున్నారని గ్రామ కోఆప్షన్ సభ్యుడు రాజ్ కుమార్ యాదవ్ ఆరోపించారు. హమీదుల్లా గ్రామస్తులకు కాకుండా కొందరు బయటివారికి ఇండ్లు వచ్చేలా చేశారన్నారు.
శంషాబాద్లో చలివేంద్రం ఏర్పాటు సోషల్యాక్టివిస్ట్కందకట్ల సిద్ధురెడ్డి, సినీ హీరో ఇంద్రసేన కలిసి శంషాబాద్బస్టాండ్సమీపంలో ఉచిత మజ్జిగ, మంచినీరు పంపిణీ చేసేందుకు చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ బుధవారం ప్రారంభించారు.