
- భద్రాద్రికొత్తగూడెం అడిషనల్ కలెక్టర్ డి. వేణుగోపాల్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని 440 మంది దివ్యాంగులకు రూ. 1.11కోట్ల విలువైన దివ్యాంగ పరికరాలను పంపిణీ చేశామని భద్రాద్రికొత్తగూడెం అడిషనల్ కలెక్టర్ డి. వేణుగోపాల్ తెలిపారు. కొత్తగూడెంలోని పాత కొత్తగూడెంలో సోమవారం దివ్యాంగ పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టీస్ అండ్ ఎంపవర్ మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలింకో సహకారంతో ఈ పరికరాలను పంపిణీ చేస్తున్నామన్నారు.
పంపిణీ చేసిన వాటిలో బ్యాటరీ ట్రై సైకిల్స్, వీల్ చైర్స్, ట్రై సైకిల్స్, వినికిడి యంత్రాలు, సీపీ చైర్స్, చంక కర్రలు ఉన్నాయని తెలిపారు. ఈ ప్రోగ్రాంలో జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, డీఎంహెచ్వో భాస్కర్ నాయక్, సీడీపీవో పద్మశ్రీ, ఐఈడీ శ్రీరాం, టీవీపీఎస్ అధ్యక్షుడు గుండపనేని సతీశ్, డీసీపీవో హరికుమారి పాల్గొన్నారు.
భూ సమస్యలపై దరఖాస్తు చేసుకోవాలి
జూలూరుపాడు : భూ సమస్యలున్న రైతులు రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకోవాలని అడిషినల్ కలెక్టర్ వేణుగోపాల్ సూచించారు. సోమవారం మండల పరిధిలోని కాకర్ల గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో దరఖాస్తుల స్వీకరణను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ ఆదినారాయణ, పంచాయితీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.