భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో రూ.1.11కోట్ల విలువైన దివ్యాంగ పరికరాలు పంపిణీ

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో రూ.1.11కోట్ల విలువైన దివ్యాంగ పరికరాలు పంపిణీ
  • భద్రాద్రికొత్తగూడెం అడిషనల్​ కలెక్టర్​ డి. వేణుగోపాల్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని 440 మంది దివ్యాంగులకు రూ. 1.11కోట్ల విలువైన దివ్యాంగ పరికరాలను పంపిణీ చేశామని భద్రాద్రికొత్తగూడెం అడిషనల్​ కలెక్టర్​ డి. వేణుగోపాల్​ తెలిపారు. కొత్తగూడెంలోని పాత కొత్తగూడెంలో సోమవారం దివ్యాంగ పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మినిస్ట్రీ ఆఫ్​ సోషల్​ జస్టీస్​ అండ్​ ఎంపవర్​ మెంట్​ గవర్నమెంట్​ ఆఫ్​ ఇండియా అలింకో సహకారంతో ఈ పరికరాలను పంపిణీ చేస్తున్నామన్నారు.

పంపిణీ చేసిన వాటిలో బ్యాటరీ ట్రై సైకిల్స్​, వీల్​ చైర్స్​, ట్రై సైకిల్స్​, వినికిడి యంత్రాలు, సీపీ చైర్స్, చంక కర్రలు ఉన్నాయని తెలిపారు. ఈ ప్రోగ్రాంలో జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, డీఎంహెచ్​వో భాస్కర్​ నాయక్, సీడీపీవో పద్మశ్రీ, ఐఈడీ శ్రీరాం, టీవీపీఎస్​ అధ్యక్షుడు గుండపనేని సతీశ్, డీసీపీవో హరికుమారి పాల్గొన్నారు. 

భూ సమస్యలపై దరఖాస్తు చేసుకోవాలి 

జూలూరుపాడు : భూ సమస్యలున్న  రైతులు రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకోవాలని అడిషినల్​ కలెక్టర్​ వేణుగోపాల్ సూచించారు. సోమవారం మండల పరిధిలోని  కాకర్ల గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో దరఖాస్తుల స్వీకరణను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తహసీల్దార్​ శ్రీనివాస్​, ఆర్ఐ ఆదినారాయణ, పంచాయితీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.