వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్పిస్తా : డీకే అరుణ

వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్పిస్తా : డీకే అరుణ

గద్వాల, వెలుగు: వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్పించే బాధ్యత తనదేనని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. శనివారం మల్దకల్  మండలం తాటికుంట గ్రామంలో వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో బీసీలకు బీజేపీ పెద్దపీట వేసిందన్నారు. ఇందులో భాగంగా గద్వాల నియోజకవర్గంలో వాల్మీకి బోయలు ఎక్కువగా ఉండడంతో , ఇక్కడ ఎమ్మెల్యేగా అవకాశం కల్పించడం జరిగిందన్నారు.

వాల్మీకి బోయలంతా ఏకమై బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్దే తప్ప, ఈ పదేళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. రామాంజనేయులు, వెంకటేశ్వర రెడ్డి, పాల్వాయి రాముడు, కృష్ణంరాజు, రాముడు, వీరుబాబు పాల్గొన్నారు.