న్యూఢిల్లీ: రిటైల్ చైన్ డీమార్ట్ నిర్వహించే అవెన్యూ సూపర్మార్ట్స్ లిమిటెడ్ డిసెంబరుతో ముగిసిన మూడో క్వార్టర్లో రూ.13,247 కోట్ల ఆదాయం సంపాదించింది. ఇది వార్షికంగా 17.18 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఏడాది క్రితం అక్టోబర్-–డిసెంబర్ క్వార్టర్లో కంపెనీ కార్యకలాపాల ద్వారా రూ.11,304.58 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
సెప్టెంబర్ 30, 2023 నాటికి మొత్తం స్టోర్ల సంఖ్య 341కి చేరుకుంది. రాధాకిషన్ దమానీ, ఆయన కుటుంబం ప్రమోట్ చేస్తున్న డీమార్ట్ మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఎన్సీఆర్, తమిళనాడు, పంజాబ్ రాజస్థాన్తో సహా పలు చోట్ల స్టోర్లను నిర్వహిస్తోంది.