
భద్రాచలం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో మలేరియా నివారణకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని డీఎం హెచ్వో భాస్కర్ నాయక్ అన్నారు. భద్రాచలంలో బుధవారం ఆయన జిల్లాలోని వైద్యా, ఆరోగ్య సిబ్బందితో, ల్యాబ్ టెక్నీషియన్లతో మీటింగ్ నిర్వహించి మాట్లాడారు.
జ్వరం వచ్చిన ప్రతి ఒక్కరికీ రక్త పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. వారికి మలేరియా డోస్ ఇవ్వాలని సూచించారు. పేషెంట్ల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. దోమల నివారణకు స్ప్రే మందు, టెస్టింగ్ కిట్లు స్టాఫ్కు పంపిణీ చేశారు.