డ్యూటీలో నిర్లక్ష్యం వద్దు

డ్యూటీలో  నిర్లక్ష్యం వద్దు

నేరడిగొండ , వెలుగు : పీహెచ్ సీ లో వైద్యులు , సిబ్బంది సక్రమంగా పని చేయాలని, విధులు విస్మరిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్ అన్నారు. నేరడిగొండ పీహెచ్ సీ ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా టీబీ అధికారి శ్రీకాంత్ , డాక్టర్ సద్దాం , వైద్య సిబ్బంది హరి కుమార్ గౌడ్ , తదితరులు ఉన్నారు.