ఉప్పల్, వెలుగు: మల్లాపూర్లోని ఓ హోటల్లో పెట్టనున్న వైన్షాప్ కి అనుమతి ఇవ్వొద్దని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో మల్లాపూర్లోని సెయింట్ ఆన్స్ డిగ్రీ, పీజీ విమెన్ కాలేజీ స్టూడెంట్లు సోమవారం ఆందోళన చేపట్టారు. హైవేపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా ఏఐవైఎఫ్ నాయకులు మాట్లాడుతూ మల్లాపూర్లోని సెయింట్ ఆన్స్ విమెన్ కాలేజీకి దగ్గరలోనే వైన్షాప్ ఏర్పాటవుతోందన్నారు. చుట్టుపక్కల స్కూల్స్ దగ్గర కూడా వైన్స్ షాప్ లు వస్తున్నాయన్నారు. అధికారులు వెంటనే స్పందించి ఇవి ఏర్పాటుచేయకుండా వేరే చోటుకి తరలించాలని డిమాండ్ చేశారు.
పర్మిషన్ లేకుండా వైన్ షాప్ లు నడుపుతున్నరు.
జీడిమెట్ల, నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో పర్మిషన్లు లేకుండా వైన్షాప్లను నిర్వహిస్తున్నారని బీజేపీ నాయకులు అధికారులకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ నిజాంపేట్గవర్నమెంట్స్కూల్, మరో ప్రయివేటు స్కూల్ఎదుట వైన్షాపులు ఉన్నాయనీ, వాటికి ఎలాంటి అనుమతీ లేదని వారు తెలిపారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో ఆ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు ఆకుల సతీశ్, రాంచందర్, చంద్రమౌలి, బిక్షపతి ఉన్నారు.